Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. ప్రాణగండం నుంచి తప్పించుకున్న ఎస్పీబీ

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (16:06 IST)
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో లెజెండరీ సింగర్‌గా గుర్తింపు పొందిన ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం ఎట్టకేలకు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. ఆగస్టు నెలలో కరోనా వైరస్ బారినపడిన ఆయన.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆయన కుమారుడు ఎస్.పి.చరణ్ తెలిపారు.
 
కాగా, కరోనా వైరస్ బారిన ఎస్బీబీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ముఖ్యంగా, ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో శ్వాసపీల్చడం కష్టంగా మారిపోయింది. దీంతో ఆయనకు వెంటిలేటర్‌తో పాటు ఎక్మో పరికరాన్ని అమర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఓ దశలో పరిస్థితి విషమంగా మారడంతో ఎస్పీ బాలును ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. ఆపై ఎక్మో సాయం కూడా అందిస్తున్నారు. దీనిపై ఎస్పీ చరణ్ తాజాగా ఓ ప్రకటన చేశారు.
 
త్వరలోనే తన తండ్రికి ఎక్మో, వెంటిలేటర్ తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఆయనకు వెంటిలేటర్, ఎక్మో వ్యవస్థల సాయంతోనే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఫిజియోథెరపీ కొనసాగుతోందని ట్విట్టరులో వివరించారు. 
 
ఎంజీఎం ఆసుపత్రి వైద్యుల బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, అంతేకాకుండా, తన తండ్రి క్షేమం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments