Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీతో రిలేషన్షిప్‌ను వద్దనుకున్న బాలీవుడ్ నటి!

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (10:39 IST)
బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. పైగా, పిల్లలు కూడా. కుటుంబంలో ఏర్పడిన కలతల కారణంగా మొదటి భర్త రాజా చౌదరితో తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత అభినవ్ కోహ్లీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. దీనిపై పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. 
 
దీంతో శ్వేతా తివారీ కాస్తంత ఘాటుగా స్పందించింది. తన గురించి మీడియా ఏం రాసినా పట్టించుకోనని, తాను తన పిల్లల భవిష్యత్ కోసమే అభినవ్ కోహ్లీ నుంచి విడిపోతున్నట్టు తెలిపింది. తనను వేలెత్తి చూపేవారిపై తీవ్రంగా మండిపడింది.
 
తమ భాగస్వాములను మోసం చేసే వారితో పోలిస్తే తాను చాలా బెటరని శ్వేత పేర్కొంది. రిలేషన్‌షిప్‌ను వద్దనుకునే గట్స్ తనకు ఉన్నాయని తెలిపింది. ఏదైతో సరైనదో దానినే చేస్తానని చెప్పుకొచ్చింది. తన గురించి ఏమి రాసినా పట్టించుకోబోనని పునరుద్ఘాటించింది. 
 
అంతేకాదు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా వివాహంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచేందుకు ఓ ప్లాట్‌ఫామను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కాబట్టి వివాహ బంధంలో ఎదుర్కొంటున్న బాధల నుంచి బయటకు రావాలని, ఎవరినీ కేర్ చేయొద్దని మహిళలకు పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments