ఇండిగో విమాన సేవలు రోజురోజుకూ దిగిపోతున్నాయి : శృతిహాసన్

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (17:14 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో విమాన సంస్థపై సినీ హీరోయిన్ శృతిహాసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇండిగో విమాన సేవలు నానాటికీ దిగజారిపోతున్నాయన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యమైందని, ఈ చర్య అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయనని చెప్పిన ఆమె... కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమానయాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని తన ట్వీట్లో రాసుకొచ్చారు.
 
తనతోపాటు పలువురు ప్రయాణికులు ఎయిర్ పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంటల పాటు ఉండిపోయామని శృతిహాసన్ తెలిపారు. ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానం ఆలస్యం విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమానయాన సంస్థ తన సర్వీసులను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు.
 
ఇక శృతిహాసన్ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విషయాన్ని శృతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది. అయితే, ఇండిగో సమాధానాన్ని పలువురు నెటిజన్లు విమర్శించారు. ప్రతికూల వాతావరణం ఉంటే ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని దుయ్యబట్టారు. ఉన్న విషయం చెబితే ప్రయాణికులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments