Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం క్వారంటైన్‌లో ఏకాంతంగా ''జెర్సీ" హీరోయిన్

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (13:53 IST)
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 50 వేలకు పైగా రోగులు చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అనేక సెలెబ్రిటీలు కూడా ఈ వైరస్ బారినపడి చనిపోయారు. మరికొందరు సెలెబ్రిటీలు ముందుగానే జాగ్రత్తపడి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అలా హోం క్వారంటైన్‌లో ఉన్నవారిలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. ఈమె తెలుగు హీరో నాని నటించిన "జెర్సీ" చిత్రంతో మంచి ఫేమస్ అయ్యారు. 
 
బెంగళూరుకు చెందిన శ్రద్ధా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తుండడంతో అధికంగా విమాన ప్రయాణాలు చేసేది. దీంతో కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను శ్రద్ధా ఖండించింది.
 
మార్చి 12 -15 తేదీల మధ్య కాలంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై విమాన ప్రయాణం చేశానని, ఆ విమానంలో ఎవరికీ కరోనా సోకలేదని, అయినా తన ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు తనకు తానుగా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది.  మార్చి 29 నాటికి క్వారంటైన్‌ 14 రోజులు పూర్తయిందని, ప్రస్తుతం కిచెన్‌లో అమ్మకి సాయం చేస్తున్నానని కూడా శ్రద్ధా ట్వీట్‌ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్త కళ్లలో కారం కొట్టి చంపేసిన భార్య!

కోల్‌కతా విద్యార్థిని రేప్ కేసు : తప్పంతా నిందితురాలిదే.. టీఎంసీ నేత మదన్ మిత్రా

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments