Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 'కత్తి'కి పదును పెడుతున్న రచయిత ఎవరు? పరుచూరి బ్రదర్స్ సంగతేంటి?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కత్తి. ఈ చిత్రానికి మాటల రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రం పట్టాలెక్కేంత వరకు వీరిద్దరే సంభాషణల రచయిత అని ప్రతి ఒక్కరూ భావించారు.

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (14:27 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కత్తి. ఈ చిత్రానికి  మాటల రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రం పట్టాలెక్కేంత వరకు వీరిద్దరే సంభాషణల రచయిత అని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, అతి తక్కువ కాలంలోనే సంభాషణల రచయితగా మంచి గుర్తింపు తెచ్చకున్న సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి కలం కదిలిస్తున్నారట. 
 
నిజానికి తొలి నుంచి వివి వినాయక్ చిత్రాలకు పరుచూరి బ్రదర్సే మాటల రచయితలుగా ఉంటారు. అయితే, తాజాగా కత్తిలాంటోడు చిత్రం కోసం వీరికి 'కృష్ణం వందే జగద్గురం' సినిమాతో తెరపైకి వచ్చిన సాయి మాధవ్ తోడయ్యారు. అబ్బూరి రవి కూడా ఈ సినిమా కోసం కొన్ని మాటలు మూటగడుతున్నారట. రచయితలుగా పరచూరి సోదరుల గురించి నేడు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 
 
అయినప్పటికీ సాయి మాధవ్‌ సీన్‌లో ఎంటరవడం విశేషం. సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల్లో సందేశాత్మక సంభాషణలు రాయడానికే సాయి మాధవ్‌ని సంప్రదించారని సమాచారం. ఆ మధ్య సాయి మాధవ్ ప్రతిభ గుర్తించిన పవన్ ‘గోపాల గోపాల’, ‘సర్దార్’ సినిమాలకు మాటలు రాయించారు. సంభాషణల పరంగా ‘గోపాల గోపాల’కు ఎలాంటి స్పందన లభించిందో తెలిసిందే. ఇప్పుడు చిరు రీ ఎంట్రీ సినిమాకీ సాయి మాధవ్ సహకారం తోడవటంతో ‘కత్తి’ మరింత పదునెక్కిందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments