Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్న పొడుగుకాళ్ళ సుందరి

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (15:17 IST)
బాలీవుడ్ అందాల హీరోయిన్లలో ఒకరు శిల్పాశెట్టి. అచ్చం చెక్కిన శిల్పాన్ని తలపించే అందం. ఈమె సుధీర్ఘకాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె కేవలం బాలీవుడ్‌లోనేకాకుండా దక్షిణాది భాషల్లోనూ తన నటనతో మంచి అభిమానగణాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. 
 
కానీ, ఒకవైపు తన వైవాహిక జీవితంలో బీజీగా గడుపుతూనే, మరోవైపు యోగా వీడియోలు, ఫిట్నెస్ వీడియోలు, ఐపీఎల్ క్రికెట్‌తో నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో గత 2007లో "ఆప్నే" అనే చిత్రంలో శిల్పాశెట్టి నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ.. చిన్నచిన్నపాత్రలకే పరిమితమైంది. 
 
ఈ పరిస్థితుల్లో దశాబ్దకాలానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ మంగళూరు భామ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి స్వయంగా చెప్పింది. త్వరలోనే షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న "నికమ్మా" అనే చిత్రంలో నటించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడు పోస్టు పెట్టింది. 

సంబంధిత వార్తలు

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments