కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం. ఇటీవలే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన మోషన్ పోస్టర్కి ప్రేక్షకాభిమానుల నుంచి, పరిశ్రమ నుంచి చక్కని ప్రశంసలు దక్కాయి. `ఓ పిల్లా నీ వల్లా` పోస్టర్ ఆసక్తి రేకెత్తించిందని ప్రశంసించారంతా.
తాజాగా ఈ సినిమా టీజర్ని `శతమానం భవతి` వంటి బ్లాక్బస్టర్తో తారాపథంలోకి దూసుకొచ్చిన మెస్మరైజింగ్ స్టార్ శర్వానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. 'టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుగు ప్రేక్షకులు వైవిధ్యాన్ని, కొత్తదనాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద హిట్టవుతుందన్న నమ్మకం ఉంది. దర్శకనిర్మాత కిషోర్కి అభినందనలు' అన్నారు.
చిత్ర దర్శక నిర్మాత కిషోర్ మాట్లాడుతూ... 'ఓ పిల్లా నీ వల్లా.. చక్కని లవ్, కామెడీ - యాక్షన్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రమిది. ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాం. పూరి ఆవిష్కరించిన పోస్టర్కి చక్కని ప్రశంసలు వచ్చాయి. అలాగే మెస్మరైజింగ్ స్టార్ శర్వానంద్లాంటి సక్సెస్ఫుల్ హీరో మా సినిమా టీజర్ని ఆవిష్కరించడమే ఓ పెద్ద సక్సెస్గా భావిస్తున్నాం. శర్వాకి ప్రత్యేక ధన్యవాదాలు' అన్నారు.