Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్‌ రెడ్డి'కి నేనెప్పటికీ రుణపడి ఉంటాను.. షాలినీ పాండే

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (13:33 IST)
Arjun Reddy
ఆగస్టు 25 తన జీవితంలోనే కీలకమైన రోజంటూ.. నటి షాలినీ పాండే తెలిపింది. అంతేగాకుండా.. అర్జున్‌ రెడ్డి కోస్టార్‌ విజయ్‌ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పింది. దాదాపు ఐదేళ్ల క్రితం ఇదే రోజున తాను నటిగా వెండితెరకు పరిచయమైన 'అర్జున్‌ రెడ్డి' విడుదలై ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించిందని గుర్తు చేసింది. 
 
ఆ సినిమాలో తాను పోషించిన ప్రీతి పాత్రకు మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞురాలినేనని షాలినీ పాండే వెల్లడించింది. ఈ సందర్భంగా 'అర్జున్‌ రెడ్డి'కి తానెప్పటికీ రుణపడి ఉంటా. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ధన్యవాదాలు. తొలి చిత్రం ఎలా చేస్తానోనని కంగారు పడుతోన్న తనలో ఉత్సాహాన్ని నింపి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేశాడని కితాబిచ్చింది. 
 
"లైగర్‌'.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్ యూ. అలాగే నీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా'' అని షాలినీ రాసుకొచ్చింది. సందీప్‌ రెడ్డి వంగా - విజయ్‌ దేవర కొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్‌ చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. షాలినీ పాండే కథానాయిక. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments