Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున్‌ రెడ్డి'కి నేనెప్పటికీ రుణపడి ఉంటాను.. షాలినీ పాండే

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (13:33 IST)
Arjun Reddy
ఆగస్టు 25 తన జీవితంలోనే కీలకమైన రోజంటూ.. నటి షాలినీ పాండే తెలిపింది. అంతేగాకుండా.. అర్జున్‌ రెడ్డి కోస్టార్‌ విజయ్‌ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పింది. దాదాపు ఐదేళ్ల క్రితం ఇదే రోజున తాను నటిగా వెండితెరకు పరిచయమైన 'అర్జున్‌ రెడ్డి' విడుదలై ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించిందని గుర్తు చేసింది. 
 
ఆ సినిమాలో తాను పోషించిన ప్రీతి పాత్రకు మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞురాలినేనని షాలినీ పాండే వెల్లడించింది. ఈ సందర్భంగా 'అర్జున్‌ రెడ్డి'కి తానెప్పటికీ రుణపడి ఉంటా. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ధన్యవాదాలు. తొలి చిత్రం ఎలా చేస్తానోనని కంగారు పడుతోన్న తనలో ఉత్సాహాన్ని నింపి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేశాడని కితాబిచ్చింది. 
 
"లైగర్‌'.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్ యూ. అలాగే నీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా'' అని షాలినీ రాసుకొచ్చింది. సందీప్‌ రెడ్డి వంగా - విజయ్‌ దేవర కొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్‌ చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. షాలినీ పాండే కథానాయిక. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments