Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో లలిత్ మోడీని కలవలేదు: షారూక్ స్పష్టం

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (11:53 IST)
ఐపీఎల్ స్కాం లో చిక్కుకుని విదేశాల్లో తలదాటుకున్న ఐపీఎల్ మాజీ ఛీఫ్ లలిత్ మోడీని తాను కలుసుకోలేదని బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ స్పష్టం చేశారు. లలిత్ మోడీని ఆయన లండన్‌లో కలుసుకున్నట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా షారూక్ మాట్లాడుతూ.. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానిగా మాత్రమే లలిత్ మోడీతో తనకు సంబంధం ఉందని, అది కూడా ఆయన చైర్మన్‌గా ఉన్న రోజుల్లోనే అని షారూక్ వెల్లడించారు. 
 
తనపై ఆరోపణలు వచ్చిన రోజున తాను లండన్‌లో లేనని తెలిపారు. ఆ రోజు తాను షూటింగ్ నిమిత్తం బల్గేరియాకు వెళ్లినట్టు చెప్పారు. అంతకుముందు రోజు రాత్రి పొద్దుపోయే దాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామని, ఆపై విమానాశ్రయానికి వచ్చి రెండు గంటల సమయంలో విమానం ఎక్కి తదుపరి రోజు సాయంత్రం ఆరింటికి దిగామని, ఆవెంటనే తన కొడుకు, కూతురు స్కూల్ అడ్మిషన్ పనుల్లో బిజీ అయ్యానని ఖాన్ వివరించారు. 
 
ఇలా తాను బిజీగా ఉండగా లలిత్ మోడీని ఎక్కడ కలిసి ఉంటానని అనుకుంటారని ప్రశ్నించారు. అసలు తాను లండన్‌లో లలిత్ మోడీని కలవనేలేదని తెలిపిన షారూక్.. ఒకే వేళ తాను లలిత్ మోడీని కలిసి ఉంటే అతడే ఈ పాటికి అందరికీ చెప్పి ఉండావడని అన్నారు. తనపై అనవసర ఆరోపణలు తగవని షారూక్ అన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments