మంత్రి పేర్ని నానికి అర్జెంటుగా 'రాబిస్' వ్యాక్సిన్ వేయండి.. నాగబాబు ఫైర్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:37 IST)
జసనేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా, విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూకడుతున్నారు. 
 
దీంతో 'వకీల్ సాబ్' సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అన్ని వర్గాల సినీ అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి రేటింగ్ సాధించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ చర్చనీయాంశంగా మారింది.
 
ఈ సినిమా బెనెఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, పవన్ కల్యాణ్‌కు భయపడే స్పెషల్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏపీ బీజేపీ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ విమర్శించారు. 
 
ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... 'మీకు దురద ఉందని తెల్లవారుజామున 5 గంటలకే వెళ్తే షో వేయరు సునీల్ గారూ' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. పేర్ని నానిపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కరోనా వాక్సిన్‌తో పాటు రేబిస్ వాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రేబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని, స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ' అని వ్యాఖ్యానించారు. కుక్క కరిచిన వారికి రేబిస్ ఇంజెక్షన్లు వేస్తారనే విషయం తెలిసిందే. ఇపుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతాయో చూద్ధాం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments