Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీదేవి మరణంపై నిజాలు దాచాయంటున్న మహిళ... సీబీఐ చార్జిషీటు

ఠాగూర్
సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (09:55 IST)
అందాల నటి శ్రీదేవి మృతిపై భారత్, యూఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచాయని భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటి అనే మహిళ ఆరోపించింది. పైగా, శ్రీదేవి మృతిపై ఆమె సొంతంగా దర్యాప్తు కూడా జరిపి, భారత్, యూఏఈలు నిజాలు దాచాయంటూ నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై కేంద్రం ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. విచారణ జరిపి చార్జిషీటును తయారు చేసి దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ ఆదివారం వెల్లడించింది. ఈ పరిణామంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా శ్రీదేవి మరణంపై దీప్తి నకిలీ పత్రాలను సృష్టించింది. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్ చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి మరణంపై దీప్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఏఈ - భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్ల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఇవే సాక్ష్యాలు అంటూ ప్రదర్శించారు. 
 
దీంతో కేంద్రం ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. ఇవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబైకి చాందినీ షా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీదేవి 2018లో దుబాయ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవికి భర్త బోనీ కపూర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kiran Royal: నాకు క్లీన్ చిట్ లభించింది. పవన్ కల్యాణ్‌కు నేనేంటో తెలుసు.. ఆధారాలు సమర్పిస్తా (videos)

Love Letter : చిక్క తిరుపతి హుండీలో లవ్ లెటర్.. ఓ దేవా నన్ను, నా ప్రేమికుడిని కలపండి!

పొరుగింటి గొడవ.. ఆ ఇంటికి వెళ్లాడని ఐదేళ్ల బాలుడి హత్య.. కన్నతండ్రే ముక్కలు ముక్కలుగా నరికేశాడు..

ప్రభుత్వ ఉద్యోగం కోసం 4 గంటల్లో 25 కి.మీ నడక టెస్ట్, కుప్పకూలి ముగ్గురు మృతి

చంద్రబాబు-దగ్గుబాటిల మధ్య శత్రుత్వం నిజమే.. కానీ అది గతం.. ఎంత ప్రశాంతమైన జీవితం..! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments