ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో హ్యాట్రిక్ను సాధించి క్రేజీస్టార్గా మారాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి రాజ్తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’ చిత్రంపై వుంది. షూటింగ్ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు.
శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది.
ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్తరుణ్ సెకండ్ హ్యాట్రిక్కు శ్రీకారంలా వుంటుంది. డిసెంబరులో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేసి, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.