'అలా.. వైకుంఠపురం' నటుడు ఉపేంద్రపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (10:47 IST)
అల్లు అర్జున్ 'అలా.. వైకుంఠపురం'లో నటించిన కన్నడ నటుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదు అయ్యింది.
 
'ప్రజాకీయా' వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర శనివారం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌ నిర్వహించారు. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో ఉపేంద్ర వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురి చేశాయంటూ ఆదివారం బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఉపేంద్రపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్‌ బెంగళూరు డీసీపీ కృష్ణకాంత్‌ తెలిపారు.
 
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్‌ వీడియోను సైతం తన సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. 'ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్‌లో పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశాను. నా వ్యాఖ్యల కారణంగా కొంతమంది ఇబ్బందిపడ్డారని గ్రహించిన వెంటనే లైవ్‌ వీడియోను తొలగించాను. ఆ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నన్ను క్షమించండి' అంటూ ఆయన పోస్ట్‌ పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments