Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ కథానాయకుడు'తో ఆటాడుకుంటున్న రాంచరణ్‌, వరుణ్ తేజ్

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (21:17 IST)
సంక్రాంతి పండుగకు ముందే తెలుగు ప్రేక్షకులకు నిజమైన సినిమా పండుగ వచ్చేసింది. వరుసగా 9వ తేదీ నుంచి నాలుగు సినిమాలు విడుదలవడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 9వ తేదీ విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా భారీ విజయం వైపు దూసుకువెళుతోంది. ఇక 10వ తేదీ విడుదలైన రజినీ పేట సినిమా కూడా హిట్ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
 
కానీ 11వ తేదీ రిలీజైన్ వినయ విధేయ రామ సినిమా మాత్రం భారీ కలెక్షన్ల వైపు పరుగులు పెడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో రాంచరణ్ నటించారు. రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు రోజుల్లో 8 కోట్ల రూపాయల భారీ కలెక్షన్‌ను సంపాదించింది. ఇక ఎన్టీఆర్ సినిమా అయితే మూడు రోజుల్లో 7.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కేవలం 30 లక్షల రూపాయల వ్యత్యాసం మాత్రమే. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కన్నా వినయ విధేయ రామ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. 
 
మరోవైపు ఇవాళే విడుదలైన ఎఫ్2 చిత్రం హాస్యం మేళవింపుతో సంక్రాంతి సందడి చేస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించారు. మొత్తమ్మీద ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో ఓ ఆట ఆడుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments