Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి స్పెషల్ ఆఫర్ : రూ.999కే ఎయిర్ ఏషియా టిక్కెట్స్

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (14:33 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ కేవలం 999 రూపాయలకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ టిక్కెట్ల బుకింగ్స్ మాత్రం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేసుకోవచ్చు. 
 
ఈ స్పెషల్ ఆఫర్ ధరతో దేశంలోని 20 రూట్లలో ప్రయాణం చేయవచ్చు. అంతర్జాతీయ మార్గాల్లో మాత్రం రూ.2,999కే ప్రారంభ టికెట్స్ అందుబాటులో ఉండగా.. సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి, బాలి ప్రాంతాలకు ఈ ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పటికే మరో విమానయాన సంస్థ ఇండోగో కూడా రూ.999కే టికెట్ ధరను ప్రకటించిన విషయం తెల్సిందే.
 
కాగా, ఎయిర్ ఏషియా ప్రయాణ చార్జీల్లో రాయితీ ప్రకటించిన మార్గాలను పరిశీలిస్తే, బెంగుళూరు, న్యఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొచ్చిన్, గోవా, జైపూర్, చండీఘర్, పూణె, గౌహతి, ఇంఫాల్, భోపాల్, వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, చెన్నై మార్గాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments