Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అందరి ఆశీస్సులతో నేను క్షేమంగా ఉన్నా : సంజయ్ దత్

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (16:14 IST)
కోట్లాది మంది అభిమానులు, ప్రజల ఆశీస్సులు, దీవెనలతో తాను క్షేమంగా ఉన్నట్టు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో ఉన్నట్టు తెలిపారు.
 
కాగా, శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో సంజయ్ దత్‌ను శనివారం రాత్రి ముంబైలోని లీలావతి ఆస్పత్రికి హుటాహుటిన తరలించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. పైగా, ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో సైతం నెగెటివ్ అని వచ్చింది. 
 
ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, ఆక్సిజన్‌ పెట్టే అవసరం లేకుండానే ఉండగలుగుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చినట్లు తెలిపారు. ఒకరోజు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు.
 
కాగా, తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సంజయ్‌దత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తన కొవిడ్‌ రిపోర్ట్‌ నెగెటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. తన గురించి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments