Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ అందరి ఆశీస్సులతో నేను క్షేమంగా ఉన్నా : సంజయ్ దత్

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (16:14 IST)
కోట్లాది మంది అభిమానులు, ప్రజల ఆశీస్సులు, దీవెనలతో తాను క్షేమంగా ఉన్నట్టు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలో ఉన్నట్టు తెలిపారు.
 
కాగా, శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో సంజయ్ దత్‌ను శనివారం రాత్రి ముంబైలోని లీలావతి ఆస్పత్రికి హుటాహుటిన తరలించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. పైగా, ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో సైతం నెగెటివ్ అని వచ్చింది. 
 
ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని, ఆక్సిజన్‌ పెట్టే అవసరం లేకుండానే ఉండగలుగుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చినట్లు తెలిపారు. ఒకరోజు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు.
 
కాగా, తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సంజయ్‌దత్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తన కొవిడ్‌ రిపోర్ట్‌ నెగెటివ్‌ వచ్చిందని, ప్రస్తుతం తాను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. తన గురించి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: స్థూలకాయంపై ప్రధాని.. ఊబకాయాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఆసక్తికర కామెంట్స్

వివేకానంద రెడ్డి హత్య కేసు: ఐదుగురు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి.. దర్యాప్తు

Donald Trump: రష్యాను వదిలేది లేదు.. అప్పటి దాకా ఆంక్షలు, సుంకాలు తప్పవ్: డొనాల్డ్ ట్రంప్

Chandrababu: మీరు పని నుంచి ఇంటికొచ్చేలోపు భోజనం సిద్ధంగా వుండాలి.. మహిళలూ ఊహించుకోండి..!

జనసేన పార్టీలో చేరిన పిఠాపురం మాజీ వైకాపా ఎమ్మెల్యే దొరబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments