'మనం' చిత్రంలో నటించిన సమంతకు మళ్ళీ అటువంటి భిన్నమైన పాత్ర రాలేదు. అలాంటి పాత్రచేయాలని అనుకుంటుండగా ఆ అవకాశం రావడం ఆనందంగా వుందని చెప్పింది. తాజాగా అంతకంటే భిన్నమైన పాత్రను పోషిస్తోంది. మనంలో తల్లిగా, లవర్గా రెండు పాత్రలు పోషించింది. తాజాగా తమిళ చిత్రంలో తల్లిపాత్ర పోషిస్తోంది. 'రాజ రాణి' ఫేమ్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజయ్, సమంత మధ్య అనుబంధం వుంటుంది. ప్రభు, రాధికలు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మహేంద్రన్ స్క్రీన్ప్లే సమకూరుస్తున్నాడు. ఈ నెల 26 నుంచి చిత్రం షూటింగ్ మొదలవుతుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.