హైరాబాద్ పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (13:13 IST)
హైదరాబాద్ నగరం, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ సమంత సందర్శించారు. ఆమె బుధవారం ఉదయాన్నే "శాకుంతలం" సినిమా యూనిట్ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 14వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో పెద్దమ్మ తల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. ఇందులో సమంతతో పాటు ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్, నిర్మాత నీలమ, దేవ్ మోహన్‌లు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో మలయాళీ హీరో దేవ్ మోహన్ ఓ కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే. 
 
అదేవిధంగా ప్రకాష్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు ఇతర పాత్రలను పోషించారు. పైగా, ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ బాల నటిగా వెండితెరకు పరిచయమవుతుంది. శకుంతల, దుష్యంతనుల ప్రేమకథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ క్రమంలో శాకుంతలం సినిమా యూనిట్ ప్రమోషన్ ప్రారంభించింది. కాగా, ఇప్పిటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments