Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధరమ్‌ తేజ్‌ 'చిత్రలహరి' ప్రారంభం...

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (19:47 IST)
`శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌, రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా 'నేను శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం 'చిత్రలహరి' ఈ రోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మాతలు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్‌ కొట్టగా..సాయిధరమ్‌ తేజ్‌ అమ్మగారు విజయ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా... నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) మాట్లాడుతూ - ''మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ 'రంగస్థలం' తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన హీరో.. సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌తో మా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సినిమా చేయనుండటం ఆనందంగా ఉంది. కూల్‌, ఎమోషనల్‌, హార్ట్‌ టచింగ్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో బెస్ట్‌ డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. అన్ని ఎలిమెంట్స్‌తో సాయిధరమ్‌తేజ్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్‌ చేస్తున్నాం. 
 
నవంబర్‌ మొదటివారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పించేలా సినిమాను రూపొందిస్తాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం'' అన్నారు.
 
సాయిధ‌ర‌మ్‌తేజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని, ఆర్ట్‌:  ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌, సి.ఇ.వో/సి.ఒ.ఐ: పి.చిరంజీవి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: కె.వి.వి.బాల సుబ్ర‌మ‌ణ్యం, నిర్మాత‌లు:  నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), ద‌ర్శక‌త్వం: కిషోర్ తిరుమల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments