Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీ గెలుపే మా పొగరు.. మా జనసేనాని' : హీరో సాయి ధరమ్ తేజ్

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 స్థానాల్లో గెలుపొందింది. దీంతో పవన్ కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కొందరు సేరుగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
ఇక మంగళవారం ఎన్నికలు ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్ తేజ్, కుమారుడు అకీరా నందన్‌ కూడా ఉన్నారు. అయితే, మంగళగిరికి చేరుకున్న తర్వాత హీరోయి సాయి ధరమ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను గట్టిగా హత్తుకుని మరోమారు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
ఆ తర్వాత ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్ కళ్యాణ్ నా హీరో. నా గురువు" అని పవన్‌పై ఉన్న తన ప్రమేను మరోమారు చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అభిమానులు, నెటిజన్లు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్ యొక్క ఉత్తమ డెజర్ట్ ప్రదేశాలు

భారీగా పట్టుబడిన గంజాయి- 900 కేజీలు స్వాధీనం.. విలువ రూ.2.25కోట్లు

కాంగ్రెస్ హయాంలోనే అవినీతి పురుడుపోసుకుంది.. హర్యానాలో ప్రధాని ఫైర్

తిరుమల లడ్డూ వివాదం- కాలినడకన తిరుమలకు వైకాపా చీఫ్ జగన్

బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం : ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments