Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును ఆ పని చేశాను, నిజం ఒప్పుకున్న రియా చక్రవర్తి

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (21:07 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నార్కోటెక్స్ బ్యూరో విచారణలో డ్రగ్స్ కొన్నట్లు నటి రియా చక్రవర్తి  ఒప్పుకుంది. సుశాంత్ కోసమే డ్రగ్స్ కొన్నానని, తన సోదరుడు సోబిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రియా విచారణలో వెల్లడించింది. 
 
ప్రస్తుతానికి దర్యాప్తు ముగిసింది. కానీ రేపు మళ్ళీ విచారణకు హాజరవ్వాలని ఎన్‌సిబి అధికారులు రియాకు సమన్లు జారీ చేశారు. సుశాంత్ చక్రవర్తి లవర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటెక్ బ్యూరోలు రియాను, ఆమె సోదరుడిని విచారిస్తూనే ఉన్నారు.
 
రియా డ్రగ్స్ కూడా వాడినట్లు విచారణలో బయటపడింది. తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని మొదట్లో రియా బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ విచారణలో మాత్రం నిజాలను ఒప్పేసుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది. 
 
రియా చక్రవర్తి వ్యవహారం మొత్తం వాట్సాప్ చాట్‌తోనే బయటపడింది. డ్రగ్స్ కొనడం, అమ్మడంతో పాటు ఆమె కూడా తీసుకొనేది. డ్రగ్స్ యాక్ట్ 1980 ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. దీంతో ఆమెను అరెస్టు చేయడం దాదాపు ఖరారైంది. రేపు విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments