Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును ఆ పని చేశాను, నిజం ఒప్పుకున్న రియా చక్రవర్తి

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (21:07 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నార్కోటెక్స్ బ్యూరో విచారణలో డ్రగ్స్ కొన్నట్లు నటి రియా చక్రవర్తి  ఒప్పుకుంది. సుశాంత్ కోసమే డ్రగ్స్ కొన్నానని, తన సోదరుడు సోబిక్ చక్రవర్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రియా విచారణలో వెల్లడించింది. 
 
ప్రస్తుతానికి దర్యాప్తు ముగిసింది. కానీ రేపు మళ్ళీ విచారణకు హాజరవ్వాలని ఎన్‌సిబి అధికారులు రియాకు సమన్లు జారీ చేశారు. సుశాంత్ చక్రవర్తి లవర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటెక్ బ్యూరోలు రియాను, ఆమె సోదరుడిని విచారిస్తూనే ఉన్నారు.
 
రియా డ్రగ్స్ కూడా వాడినట్లు విచారణలో బయటపడింది. తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని మొదట్లో రియా బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ విచారణలో మాత్రం నిజాలను ఒప్పేసుకుంది. దీంతో ఆమెను అరెస్టు చేయడం ఖాయమని తెలుస్తోంది. 
 
రియా చక్రవర్తి వ్యవహారం మొత్తం వాట్సాప్ చాట్‌తోనే బయటపడింది. డ్రగ్స్ కొనడం, అమ్మడంతో పాటు ఆమె కూడా తీసుకొనేది. డ్రగ్స్ యాక్ట్ 1980 ప్రకారం ఇది చట్టరీత్యా నేరం. దీంతో ఆమెను అరెస్టు చేయడం దాదాపు ఖరారైంది. రేపు విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

ఎయిర్ ఇండియా విమానం తోకలో బైటపడిన ఎయిర్ హోస్టెస్ మృతదేహం

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments