Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల

సెల్వి
మంగళవారం, 20 ఆగస్టు 2024 (12:32 IST)
P Sushila
ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి.సుశీల తీవ్ర కడుపునొప్పితో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉండగా, సుశీలమ్మ జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 
 
ఆమె అద్భుత గాత్రంతో సంగీత పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. ఉత్తమ మహిళా గాయనిగా ఐదు భారతీయ జాతీయ అవార్డులు, 2008లో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్‌ అందుకున్నారు. అత్యధిక పాటలు పాడినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 12వేలకు పైగా తెలుగు పాటలు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, సింహళం, బెంగాలీలతో సహా పలు భాషల్లో మొత్తం 40,000 పాటలను ఆమె ఆలపించారు.
 
1935లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో జన్మించిన సుశీల సంగీతంలో చేసిన ప్రయాణం ఆమెను శిఖరాగ్రానికి చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

హెచ్‌సీయూలో ఏప్రిల్ 3 వరకు పనులు ఆపండి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments