Webdunia - Bharat's app for daily news and videos

Install App

1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్, అభివృద్ధికి రూ. 2 కోట్లు

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (19:43 IST)
ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌కు ఈరోజు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు బాహుబలి.
 
ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇది. తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం అభివృద్ది చేయనున్నారు ప్రభాస్. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్, అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసారు.
ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన చేసి... మొక్కలు నాటారు సంతోష్, ప్రభాస్. వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించారు. త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తామని ఎం.పీ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments