Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజు చనిపోవడానికి కారణం ఇదేనట.. వైద్యుల వెల్లడి

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (09:46 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు వయస్సు 82 యేళ్లు. అయితే, ఆయన మృతికి గల కారణాలను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 
 
కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, కార్డియాక్ అరెస్టుతో కన్నుమూశారని తెలిపారు. గత నెల ఐదో తేదీన ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారని చెప్పారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
అయితే, ఆదివారం వేకువజామునన తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. కృష్ణంరాజు పార్థివదేహం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకోనుంది. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేవలం మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో పాటు తీవ్రమైన కార్డియాక్ అరెస్టుతోనే చనిపోయారు. 
 
రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగినట్టు పేర్కొన్నారు. అలాగే, దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలో ఆసుపత్రిలో చేరారని వివరించారు.
 
కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచే వెంటిలేటర్‌పై ఉంచినట్టు చెప్పారు. ఈ తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నివాసానికి తరలించి, సోమవారం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments