Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావ పోయిన తర్వాత వారంతా దూరమయ్యారు : శ్రీహరి భార్య శాంతి

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (16:36 IST)
టాలీవుడ్ విలక్షణ నటుడు శ్రీహరి అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో ఆయన కుటుంబం అన్ని విధాలుగా నష్టపోయింది. ముఖ్యంగా శ్రీహరి సతీమణి శాంతి ఇంటికే పరిమితమై తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో క్షేమంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీహరి మరణం తర్వాత ఆమె పడిన కష్టాలను వెల్లడించారు. "బావ (శ్రీహరి) చనిపోయిన తర్వాత ఆ షాక్ నుంచి నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువగా మద్యం తీసుకుంటూ ఉండేదానిని. అలా రెండేళ్ళు గడిచిపోయాయి" అని చెప్పారు. 
 
మద్రాస్‌లో ఉన్న మావాళ్లు, వాతావరణం మార్పు కోసం రమ్మని ఉంటే వెళ్లాం. అక్కడే తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లివర్ డ్యామేజ్ అయిందని వైద్యులు చెప్పడంతో కొంతకాలం ఆస్పత్రికే పరిమితమయ్యాను. ఆ సమయంలో నా పిల్లలు ఏడుస్తూ నా పక్కనే ఉండేవారు. నాన్న పోయాక మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. నువ్వు కూడా పోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు ప్రశ్నించారు. ఆ ఒక్క మాట తనను ఆలోచనలో పడేసింది. 
 
తన తర్వాత పిల్లలు అనాథలైపోతారనే భయంతో మద్యం ముట్టలేదు. శ్రీహరి ఉన్నపుడు ఆయన చుట్టూ కనిపించేవాళ్ళు ఆయన చనిపోయాక ఎవరూ కనిపించలేదు. శ్రీవారి తరపు బంధువులను తాను దూరం పెట్టాననే మాటలో ఎంతమాత్రం నిజంలేదు. బావ పోయాక ఒక్కొక్కరుగా వారంతకి వారే దూరమైపోయారు. ఇది సత్యం అని శాంతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments