Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావ పోయిన తర్వాత వారంతా దూరమయ్యారు : శ్రీహరి భార్య శాంతి

ఠాగూర్
బుధవారం, 9 అక్టోబరు 2024 (16:36 IST)
టాలీవుడ్ విలక్షణ నటుడు శ్రీహరి అనారోగ్యం కారణంగా చనిపోయారు. దీంతో ఆయన కుటుంబం అన్ని విధాలుగా నష్టపోయింది. ముఖ్యంగా శ్రీహరి సతీమణి శాంతి ఇంటికే పరిమితమై తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో క్షేమంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీహరి మరణం తర్వాత ఆమె పడిన కష్టాలను వెల్లడించారు. "బావ (శ్రీహరి) చనిపోయిన తర్వాత ఆ షాక్ నుంచి నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎక్కువగా మద్యం తీసుకుంటూ ఉండేదానిని. అలా రెండేళ్ళు గడిచిపోయాయి" అని చెప్పారు. 
 
మద్రాస్‌లో ఉన్న మావాళ్లు, వాతావరణం మార్పు కోసం రమ్మని ఉంటే వెళ్లాం. అక్కడే తాను తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లివర్ డ్యామేజ్ అయిందని వైద్యులు చెప్పడంతో కొంతకాలం ఆస్పత్రికే పరిమితమయ్యాను. ఆ సమయంలో నా పిల్లలు ఏడుస్తూ నా పక్కనే ఉండేవారు. నాన్న పోయాక మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. నువ్వు కూడా పోతే మమ్మల్ని ఎవరు చూసుకుంటారని పిల్లలు ప్రశ్నించారు. ఆ ఒక్క మాట తనను ఆలోచనలో పడేసింది. 
 
తన తర్వాత పిల్లలు అనాథలైపోతారనే భయంతో మద్యం ముట్టలేదు. శ్రీహరి ఉన్నపుడు ఆయన చుట్టూ కనిపించేవాళ్ళు ఆయన చనిపోయాక ఎవరూ కనిపించలేదు. శ్రీవారి తరపు బంధువులను తాను దూరం పెట్టాననే మాటలో ఎంతమాత్రం నిజంలేదు. బావ పోయాక ఒక్కొక్కరుగా వారంతకి వారే దూరమైపోయారు. ఇది సత్యం అని శాంతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను వేశ్యగా మారుస్తానన్నాడు, అందుకే చంపేసా: భర్త హత్యపై భార్య

గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం- ఇటలీలో ఎగురుతూ కిందపడిన బీఎండబ్ల్యూ కారు (video)

జగన్‌తో విబేధాలు అక్కడ నుంచే మొదలు.. రఘు రామ కృష్ణంరాజు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments