Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయం నుంచి కోలుకుంటున్నాను.. రష్మిక మందన్న పోస్ట్

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (14:03 IST)
నటి రష్మిక మందన్న తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పుష్ప ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అల్లు అర్జున్‌తో కలిసి భారీ అంచనాల చిత్రం 'పుష్ప 2: ది రూల్'లో నటిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, రష్మిక తాను చిన్న ప్రమాదంలో చిక్కుకున్నానని, ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నానని వెల్లడించింది. రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వ్యక్తిగత ఫోటో, ఆమె కోలుకోవడం గురించి భావోద్వేగ సందేశం రాసింది.
 
"కొంతకాలంగా నేను ఇక్కడికి, బయటికి రావడం లేదు. నేను గత నెల రోజులుగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి ఒక చిన్న ప్రమాదం కారణం. నేను ఇప్పుడు కోలుకుంటున్నాను. డాక్టర్లు చెప్పినట్టు ఇంట్లోనే ఉన్నా" అని రష్మిక తెలిపింది.
 
ఇకపోతే.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 6న విడుదల కానుంది. శేఖర్ దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన 'కుబేర' చిత్రంలో కూడా రష్మిక కనిపించనుంది.
 
అలాగే 'ది గర్ల్‌ఫ్రెండ్', 'సికందర్'లో కూడా నటించనుంది. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments