బుల్లితెరపై హాట్ బ్యూటీ రేష్మి తన యాంకరింగ్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ వెండితెరపై తన అందాలను ఒలకపోసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ భామ గుంటూరు టాకీస్ అనే చిత్రంలో నటిస్తుండగా, మరో సినిమాలోనూ సంతకం చేసింది. ఆనంద్ నందా, రేష్మి, శివకృష్ణ ప్రధాన పాత్రలో వి.సినీ స్టూడియో నిర్మాణంలో డి. దివాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''రాణి గారి బంగళా''.
ఈ సినిమా లోగో లాంచ్ హైదరాబాదులోని ఫిలిమ్ ఛాంబర్లో జరిగింది. ఇక నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మార్చి నెలాఖరున విడుదల కానుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాతో రేష్మి స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని.. ఆనంద్కి ఇది తొలి సినిమా అయినా చక్కగా నటించాడని దర్శకుడు దివాకర్ వెల్లడించారు.