కరోనాకు కొందరు భయపడటం లేదు.. ట్వీట్ చేసి తప్పు చేశాను.. రష్మీ

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (12:09 IST)
అనసూయ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న యాంకర్ రష్మినే. అయితే ఎప్పుడూ నెటిజెన్స్‌కి తగిన సమాధానం చెప్పే రష్మీ ఈసారి మాత్రం నెటిజెన్స్ చేతికి అడ్డంగా దొరికిపోయింది. ఇందుకు కారణం కరోనా వైరస్సే. కరోనా వైరస్‌కి భయపడి సినిమా షూటింగ్ దగ్గర నుండి, టివి సీరియల్స్ షూటింగ్స్ వరకు అంతా బంద్ చేస్తుంటే. రష్మీ మాత్రం.. రాజమండ్రిలోని ఓ షాప్ ఓపెనింగ్‌కి వెళ్తున్నట్లు ట్వీట్ చేసింది. 
 
ఈ కార్యక్రమానికి వెళ్లిన రష్మీని చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. అప్పుడు పోలీస్‌లు ప్రజల్ని కంట్రోల్ చేసి భారీగా గుమికూడిన జనసందోహాన్ని అక్కడినుండి పంపేశారు. అయితే రష్మీ ఆ షాప్ ఓపినింగ్‌కి వస్తున్నట్టుగా ముందస్తుగా ట్వీట్ చెయ్యడం వలనే ప్రజలు కరోనా భయం లేకుండా అధిక సంఖ్యలో వచ్చారని. అందరూ అన్ని ఆపుకుని కూర్చుంటే నువ్వు మాత్రం షోరూం ఓపెనింగ్‌కి ఎలా వచ్చావ్ అంటూ నెటిజెన్స్ పెద్ద సంఖ్యలో రష్మిని ఆడుకున్నారు.
 
ఇక రష్మీ షోరూం ఓపెనింగ్ అయ్యాక నిజాయితీగా క్షమాపణలు చెప్పింది. కరోనాతో కొందరు భయపడడం లేదని.. అయినా ఇన్ని జాగ్రత్తలు అవసరమా అని, కొంతమంది బయట ఫుడ్ ఇష్టానుసారంగా తింటున్నారని తెలిపింది. వీరందరూ మారాలని.. తాను ట్వీట్ చేసి తప్పు చేశానని ఒప్పుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments