Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు హానికరమంటున్న నాగ చైతన్య... అబ్బాయిలు విషపూరితమంటున్న రకుల్.. ఎందుకు? (Trailer)

అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద

Webdunia
గురువారం, 25 మే 2017 (14:53 IST)
అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద కామెంట్స్ టాలీవుడ్‌లో రచ్చరచ్చగా మారిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదలలో మాత్రం హీరో నాగ చైతన్య ఓ డైలాగ్ చెపుతూ ఇందులో నీతి ఏంటంటే.. మనశ్శాంతికి అమ్మాయిలు హానికరమంటూ పలుకుతాడు. ఈ చిత్రంలో హీరో మాత్రం ఇలాంటి డైలాగ్ చెపుతుంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం మరోలా సెలవిస్తున్నారు. 
 
చలపతిరావు వివాదం తర్వాత ఆమె స్పందిస్తూ ఈ సినిమాలోని ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే డైలాగ్‌పై స్పందించింది. త‌న‌ను ఎవరైనా అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అని అడిగితే అబ్బాయిలు పాయిజనెస్‌ అని చెబుతానని స‌ర‌దాగా చెప్పింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది.
 
ఇప్పటివరకు తాను ఏ సినిమాలోనూ క‌నిపించన‌టువంటి పాత్రంలో ఈ సినిమాలో క‌న‌ప‌డుతున్నాన‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఈ సినిమాలో త‌న పాత్రకి ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని చెప్పింది. తాను తెలుగు నేర్చుకుంటానని, తెలుగు సినిమాల వ‌ల్లే తాను ఎంతో గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపింది. ఈ సినిమాలో ఓ ఇన్నోసెంట్‌ లవ్‌స్టోరీని చూస్తార‌ని చెప్పింది.
 
అలాగే హీరో చైతూ మాట్లాడుతూ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా చేస్తున్నప్పుడు తాను మొదట భయపడ్డానని, ఎందుకంటే, ఈ తరహా చిత్రంలో నటించడం తనకు ఇదే మొదటి సారి అని, ఇప్పుడు ఆ భయం పోయిందని ప్రముఖ నటుడు నాగ చైతన్య అన్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నాడు. భ్రమరాంబ పాత్రలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని, ఏ హీరోయిన్ రకుల్ పాత్రను అంత అద్భుతంగా పోషించలేదని కితాబు ఇచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments