Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేత్రదానం చేస్తా.. కంటి చూపు విలువేంటో తెలిసొచ్చింది: కాజల్ అగర్వాల్

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (18:28 IST)
బాలీవుడ్‌లో మూడో సినిమా దో లఫ్జోంకీ కహాని సినిమా ద్వారా కాజల్ అగర్వాల్ తొలిసారి అంధురాలిగా నటించింది. ఈ పాత్ర మహిమో ఏమో కానీ.. తాను నేత్రదానం చేస్తానని ప్రకటించింది. తద్వారా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన మానవత్వాన్ని చాటుకుంది. బాలీవుడ్‌లో ఇప్పటికే సింగం, స్పెషల్ 26 సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ మూడో సినిమా ‘దో లఫ్జోంకీ కహాని’ శుక్రవారం రిలీజ్ కానుంది.
 
ఈ సినిమాలో అంధురాలి పాత్ర కోసం పలువురు అంధులైన విద్యార్థులను కలిసి వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది. అంధుల కష్టాలు గమనించిన కాజల్ మరణానంతరం తన కళ్లు దానం చేస్తానని ప్రకటించింది. అంధురాలి పాత్ర తనలో మార్పు తీసుకొచ్చిందని అంటోంది కాజల్ అగర్వాల్. కంటి చూపు విలువేంటో తెలిసొచ్చిందని.. అందుకే తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇకపోతే కాజల్ అగర్వాల్‌తో నటించిన హీరో రణదీప్ హూడా కూడా తన కళ్లను దానం చేసేందుకు నిర్ణయించుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కోల్‌కత్తా న్యాయ విద్యార్థి అత్యాచారం కేసు : ప్రధాని నిందితుడు ఓ సైకోనా?

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments