Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా మరోసారి రాజకీయ నాయకుడిగా?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (13:53 IST)
తొలి చిత్రం ‘లీడర్‌’తోనే మెప్పించిన రానా దగ్గుబాటి ఆ తర్వాత నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో మరో విజయాన్ని అందుకోవడంతో రాజకీయం నేపథ్యంలో సాగే కథలు ఆయనకి బాగా కలిసొచ్చాయనే టాక్ ఇండస్ట్రీలో నాటుకుపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే మరో చిత్రంలోనూ రాజకీయ నాయకుడిగా ఖద్దరు దుస్తులు ధరించనున్నారని సమాచారం. ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి ‘విరాటపర్వం’ అనే టైటిల్ ఖరారు కానుందట. తొలి చిత్రంతోనే విమర్శకుల మెప్పు పొందిన వేణు, ఎమర్జెన్సీ నేపథ్యంలో బలమైన కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఇందులో రానాకి జంటగా సాయిపల్లవి జంటగా నటించనున్నారు. ప్రజాస్వామ్యం, మార్క్సిజం, మానవ హక్కులు తదితర విషయాల్ని స్పృశిస్తూ సాగే చిత్రమని సమాచారం. డి.సురేష్‌బాబు నిర్మించనున్న ఈ సినిమా... జులై నెలలో పట్టాలెక్కనుంది. 
 
కాగా ఈ సినిమాకి సంబంధించిన కథ... ఎమర్జెన్సీ నేపథ్యంలో మొదలై, 1992తో ముగుస్తుందని సమాచారం. ప్రముఖ నటి టబు కూడా ఈ చిత్రంలో మానవ హక్కుల కార్యకర్తగా బలమైన పాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా... త్రిపురనేని సాయిచంద్‌ కూడా ఓ పాత్రలో నటిస్తారు. ముచ్చటగా మూడోసారి రాజకీయ నాయకుడిగా నటించనున్న రానాకి ఈ సినిమా ఎంత మాత్రం విజయాన్ని అందజేస్తుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments