Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ అవతారమెత్తనున్న రామ్ చరణ్..

Webdunia
శనివారం, 6 జులై 2019 (12:13 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటివరకు హీరోగా నటించాడు, అలాగే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. అదేమిటా అని ఆలోచిస్తున్నారా? అదేనండీ..యాంకర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడట.
 
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరానరసింహారెడ్డికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదల ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సినిమా రిలీజ్‌కి ముందే సినిమాకి సంబంధించి ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసారట.
 
అందులో భాగంగానే రామ్ చరణ్ యాంకర్‌గా అవతారం ఎత్తనున్నాడు. సైరా టీంలోని ప్రతిఒక్కరినీ చరణ్ ఇంటర్వ్యూ చేస్తారు. ముందుగా చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ విధంగా ఇంటర్వ్యూ చేసిన వీడియోలను ఒక్కొక్కటిగా బయటకు రిలీజ్ చేసి సినిమాకి హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారట. 
 
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా గ్యాప్‌లో చరణ్ సైరా సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌లలో పాల్గొంటాడని సమాచారం. ఈ చిత్రాన్ని ఎలాగైనా అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments