Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి.. చెన్నైలో ఉంటే ఏంటి?: వర్మ ప్రశ్న

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (09:16 IST)
రాజధాని మార్పుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి అంటూ ఎదురు ప్రశ్నవేశారు. తనకు వరకు రాజధాని ఎక్కడున్నా ఒక్కటేనని చెప్పారు. అలాగే, రాజకీయాలతో సంబంధంలేని సామాన్య ప్రజలకు రాజధాని ఎక్కడున్నా ఒక్కటేనని అన్నారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని విశాఖపట్టణానికి తరలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీన్ని రాజధాని ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీలన్నీ ఒక్కటై జగన్‌ను పిచ్చి తుగ్లక్‌తో పోల్చుతున్నారు. 
 
ఈనేపథ్యంలో రాంగోపాల్ వర్మ స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. తనవరకు రాజధాని పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా పట్టించుకోనని స్పష్టం చేశారు. 
 
రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన వర్మ, ప్రజలకు నేరుగా పాలన అందించడం కోసమే రాజధాని అనుకుంటే, ప్రతి నగరంలో ఓ రాజధాని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments