Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి సిద్ధంగా ఉండండి.. వెన్నుపోటు ఫ్యాన్స్‌కు వర్మ పిలుపు

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:27 IST)
నందమూరి అభిమానులకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ విజ్ఞప్తి చేశారు. తన తాజా చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్" చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గురువారం ఉదయం 9.27 గంటలకు ఈ ట్రైలర్ విడుదల చేస్తానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
దీనికంటే ముందుగా ఆయన ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్స్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. "ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా... వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా... రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గర్లో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెఢీగా ఉండండి. ఉదయం 9.27 గంటలకు కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతుంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు" అంటూ తనదైనశైలిలో ట్వీట్ చేశారు. 
 
కాగా, ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోటు, ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతికి మధ్య జరిగిన ప్రేమ తదితర అంశాలను ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments