Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (18:45 IST)
ఏఆర్ రెహ్మాన్‌కు ఇచ్చిన మాట కోసం హీరో రామ్ చరణ్ సోమవారం కడప పెద్ద దర్గాకు వెళ్లారు. సోమవారం ఈ దర్గా 80వ వార్షిక వేడుకలు జరుగుతన్నాయి. ఇందులో రామ్ చరణ్‌తో పాటు యువ దర్శకుడు బుచ్చిబాబు కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో వెళ్ళారు. సాధారణంగా ప్రతియేటా కడప పెద్ద దర్గా పిలిచే అమీన్ పూర్ దర్గాకు ఏఆర్ రెహ్మాన్ క్రమం తప్పకుండా వెళుతుంటారు. 
 
'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రెహ్మాన్ నేరుగా ఈ దర్గాను సందర్శించిన విషయం తెల్సిందే. అయితే ఈ ఏడాది కడప దర్గా ఒక ప్రత్యేక సందర్భానికి వేదికగా మారనుంది. 80వ ముషాయిరా గజల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నారని, దీనికి ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను రెహ్మాన్ స్వయంగా ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చినట్టు సమాచారం. ఇందుకోసమే రామ్ చరణ్ కడపకు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కాగా, రామ్ చరణ్ నటించే 16వ చిత్రానికి రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్, ఏఆర్ రెహ్మాన్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కడప దర్గాకు వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments