ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (18:45 IST)
ఏఆర్ రెహ్మాన్‌కు ఇచ్చిన మాట కోసం హీరో రామ్ చరణ్ సోమవారం కడప పెద్ద దర్గాకు వెళ్లారు. సోమవారం ఈ దర్గా 80వ వార్షిక వేడుకలు జరుగుతన్నాయి. ఇందులో రామ్ చరణ్‌తో పాటు యువ దర్శకుడు బుచ్చిబాబు కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో వెళ్ళారు. సాధారణంగా ప్రతియేటా కడప పెద్ద దర్గా పిలిచే అమీన్ పూర్ దర్గాకు ఏఆర్ రెహ్మాన్ క్రమం తప్పకుండా వెళుతుంటారు. 
 
'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రెహ్మాన్ నేరుగా ఈ దర్గాను సందర్శించిన విషయం తెల్సిందే. అయితే ఈ ఏడాది కడప దర్గా ఒక ప్రత్యేక సందర్భానికి వేదికగా మారనుంది. 80వ ముషాయిరా గజల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నారని, దీనికి ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను రెహ్మాన్ స్వయంగా ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చినట్టు సమాచారం. ఇందుకోసమే రామ్ చరణ్ కడపకు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కాగా, రామ్ చరణ్ నటించే 16వ చిత్రానికి రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్, ఏఆర్ రెహ్మాన్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కడప దర్గాకు వెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments