Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ వెళ్ళినా పోర్టబుల్ ఆలయాన్ని వదల్లేదు.. చెర్రీ దంపతులకు కితాబు

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (15:04 IST)
Ramcharan_Upasana
ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ ప్రార్థనల పట్ల మక్కువ చూపుతారు. చెర్రీ ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు తనతో పాటు తన ఇష్ట దేవతలతో కూడిన చిన్న పోర్టబుల్ ఆలయాన్ని తీసుకువెళతాడు. అతను ఆస్కార్ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు లాస్ ఏంజిల్స్‌కు కూడా ఆ చిన్నపాటి ఆలయం అతనితో వెళ్ళింది.
 
"నేను ఎక్కడికి వెళ్లినా, నా భార్య.. నేను ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది మన శక్తితో, భారతదేశానికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది" అని రామ్ చరణ్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలో చెప్పారు. రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ప్రార్థనలు చేస్తున్న వీడియోను షేర్ చేశారు. 
 
రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాలకు చెర్రీ దంపతులు ప్రార్థనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అంతకుముందు కూడా రామ్ చరణ్ భక్తి ప్రవృత్తిని నెటిజన్లు మెచ్చుకున్నారు. చెర్రీ అయ్యప్ప దీక్ష చేపడతారన్న విషయం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా 40 రోజుల పాటు, నల్ల బట్టలు మాత్రమే ధరిస్తారు. చెప్పులు లేకుండా నడుస్తారు. మాంసాహారానికి దూరంగా ఉంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments