'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్‌కు ఓకే.. భార్యకు కాఫీ పెట్టిచ్చిన హీరో...

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (15:12 IST)
కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సెలెబ్రిటీల్లో ఒక్కొక్కరు ఒక్కో విధమైన పనులు చేస్తూ తమ సమయాన్ని గడిపేస్తున్నారు. కొందరు కరోనాపై అవగాహనలో భాగంగా విస్తృతమైన ప్రచారాలు చేస్తుంటే మరికొందరు వివిధ రకాలైన ఛాలెంజెస్ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో సినీ దర్శకుడు వంగా సందీప్ విసిరిన 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ను దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి స్వీకరించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా రాజమౌళి తన ఇంటిని పరిశుభ్రం చేశారు. 
 
ఆ తర్వాత టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఈ సవాలును ఇప్పటికే జూ.ఎన్టీఆర్ స్వీకరించి తన ఇల్లు వాకిలిని శుభ్రం చేశారు. పైగా ఇంట్లోని టైల్స్‌కు మాఫ్ కూడా వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అలాగే, ఇపుడు మరో హీరో రాం చరణ్ కూడా స్వీకరించారు. 
 
ఈ సవాలులో భాగంగా, ఇంటిని శుభ్రం చేసిన చెర్రీ.. ఆపై బట్టలు పిండి, మొక్కలకు నీళ్లు పోసి, భార్య ఉపాసనకు కాఫీ పెట్టి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 
 
ఇంట్లో ఈ పనులు చేయడం పట్ల గర్వంగా ఉందన్నాడు. మహిళల వర్క్‌ లోడ్‌ను షేర్ చేసుకుని నిజమైన మగాడిలా ఉండాలని సూచించాడు. ఆ తర్వాత తాను మరో ఇద్దరికి ఛాలెంజ్ విసిరాడు. వారిలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండగా, రణ్‌వీర్, రానా, శర్వానంద్‌లు ఉన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పర్యటనలో ఝులక్ - టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నేతలు

శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు...

TTD: టీటీడీలో ఇప్పటికీ నాకు నెట్‌వర్క్ వుంది- ధైర్యంగా చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments