టాలీవుడ్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ప్రజ్వల ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ విశిష్ట కానుకను బహూకరించింది. ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఓ ఉయ్యాలను ఉపాసనకు స్వయంగా అందించారు. దీనిపై ఉపాసన ట్విట్టర్లో స్పందించారు.
ప్రజ్వల ఫౌండేషన్ వారు హృదయపూర్వకంగా అందించిన ఈ కానుక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉయ్యాలను స్వీకరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని ఉపాసన పేర్కొన్నారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఊయలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు.