Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహమాటంతో నష్టం జరిగింది... : రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి కాలంలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. పైపెచ్చు.. ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (10:36 IST)
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఉన్న కుర్రకారు హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమెకు ఇటీవలి కాలంలో ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. పైపెచ్చు.. ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఆమె తమిళం, బాలీవుడ్ వైపు దృష్టిసారించింది. అక్కడ కూడా ఆమెకు అదృష్టం వరించలేదు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తనకు దక్షిణాదిలో సినీ ఆఫర్లు తగ్గిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఆ వార్తలతో తాను ఏకీభవించబోనని స్పష్టంచేశారు. సినిమాల ఎంపికలో తాను కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజమేనని చెప్పింది. తెలిసి కూడా కొన్ని తప్పులు చేశానని... ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చింది. 
 
కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల కొన్ని చేయాల్సి వస్తుందని... అవి కూడా తప్పులు జరగడానికి కారణమవుతాయన్నారు. తన సినిమాలు కొన్ని పరాజయం కావడానికి పైవన్నీ కారణాలే అని తెలిపింది. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపింది. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన తన చిత్రం 'అయ్యారీ' నిరాశపరిచినప్పటికీ... తన నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయని గుర్తుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్

దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments