Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు : రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రముఖ దర్శకులు మణిరత్నం, ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని తనకు ఉందని, ఆ అవకాశం కోసం ఎదురు

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (16:22 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈమె తాజాగా తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రముఖ దర్శకులు మణిరత్నం, ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని తనకు ఉందని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, దర్శకులు సుకుమార్, మురుగదాస్ దర్శకత్వంలో నటించానని, అదేవిధంగా మణిరత్నం, రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని చెప్పింది. వారి సినిమాల్లో నటించడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని చెప్పింది. 
 
అయితే ఫలానా హీరోతో నటించాలనేదేమీ తనకు లేదని, స్క్రిప్ట్ బాగుంటే ఎవరితోనైనా నటిస్తానని, ‘గ్లామర్ డాల్’ అని పిలిపించుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. కాగా, గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ నటించిన ‘విన్నర్’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments