Webdunia - Bharat's app for daily news and videos

Install App

నదుల అనుసంధానానికి కబాలి కోటి విరాళం: యూఎస్‌లో చికిత్స.. త్వరలో ఇండియాకు!

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నదుల అనుసంధానానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో రజనీ సోదరుడు సత్యనారాయణ ప

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (09:20 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నదుల అనుసంధానానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో రజనీ సోదరుడు సత్యనారాయణ పూజలు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు ఇచ్చిన పిలుపునకు రజనీకాంత్ స్పందిస్తూ.. ఈ ప్రక్రియకు తన వంతు సాయం చేస్తానని ప్రకటించారు. అంతేగాకుండా నదుల అనుసంధానానికి రూ.కోటి డిపాజిట్ చేశారని సత్యనారాయణ తెలిపారు. 
 
ఇటీవల గంగా-కావేరి నదుల అనుసంధానానికి రజనీకాంత్ సాయం చేయాల్సిందిగా రైతు సంఘాల సమాఖ్య నాయకులు కోరిన తరుణంలో ఆయన కోటి విరాళాన్ని అందజేసినట్లు రజనీ సోదరుడు సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు ప్రకటించారు.

నదుల అనుసంధాన ప్రక్రియ పనులు ప్రారంభమైన వెంటనే ఆ నగదును సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని సత్యనారాయణ చెప్పుకొచ్చారు. కబాలి రిలీజ్‌కు ముందు రజనీకాంత్ భారత్‌కు వస్తారని సత్యనారాయణ ప్రకటించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments