సినిమా రంగంపై ప్యాషన్ ఉన్న వారందరికీ తిక్క ఉంటుంది... రాజేంద్రప్రసాద్
శ్రీ వెంకటేశ్వర మూవీమేకర్స్ బ్యానర్పై సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం తిక్క. సునీల్ రెడ్డి దర్శకత్వంలో డా.సి.రోహిణ్ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం
శ్రీ వెంకటేశ్వర మూవీమేకర్స్ బ్యానర్పై సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం తిక్క. సునీల్ రెడ్డి దర్శకత్వంలో డా.సి.రోహిణ్ రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ సందర్భంగా... సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ``థమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. దర్శకుడు సునీల్ రెడ్డి, నిర్మాత రోహిణ్ రెడ్డి నన్ను వారి ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ గుహన్ నన్నెంతో బాగా చూపించారు. హీరోయిన్స్ మన్నార్ చోప్రా, లారిస్సా బోనేసి బాగా యాక్ట్ చేశారు. సుప్రీమ్ తర్వాత రాజేంద్రప్రసాద్గారు నాన్న పాత్రలో నటించారు. మంచి టిపికల్ రోల్ చేశాను. సపోర్ట్ చేసిన యూనిట్ సభ్యులందరికీ థాంక్స్`` అన్నారు.
దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ ``ఒక డిఫరెంట్ మూవీ చేసే అవకాశం కలిగింది. సాయిధరమ్ తేజ్తో సినిమాల్లోకి రాకముందు నుండి పరిచయం ఉంది. తనతో కలసి వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు. నిర్మాత రోహిణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వచ్చింది. నిజానికి సినిమా రంగానికి నాకు సంబంధం లేదు. అలాంటి సందర్భంలో తేజు, సునీల్రెడ్డి పరిచయంతో సినిమాల్లోకి రావాలనుకున్నాను. త్వరలోనే టీజర్ను విడుదల చేసి, ఆగస్టులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ``సినిమా అంటేనే తిక్క. సినిమా రంగంపై ప్యాషన్ ఉన్న వారందరికీ తిక్క ఉంటుంది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ విబి.రాజేంద్రప్రసాద్ తర్వాత అలాంటి నిర్మాతలా రోహిణ్ రెడ్డిగారిని చూస్తున్నాను. అలాగే దర్శకుడు సునీల్ రెడ్డి ఏ సీన్ అయినా నవ్వుతూనే డైరెక్ట్ చేసేశాడు. ఇప్పటి అనిల్ రావిపూడి, సుకుమార్ వంటి యంగ్ డైరెక్టర్స్ వల్ల డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలిగాను. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా సుప్రీమ్ తర్వాత నేను, సాయిధరమ్తేజ్ కలిసి తండ్రి కొడుకులుగా యాక్ట్చేశాం. ఈ సినిమాలో కామెడియే హైలైట్గా నిలుస్తుంది. సినిమాలో యాక్షన్ ఎంత ఉంటుందో కామెడి కూడా అంతే ఉంటుంది`` అన్నారు.
థమన్ ఎస్.ఎస్. మాట్లాడుతూ ``మోషన్ పోస్టర్ చాలా బావుంది. త్వరలోనే ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ``నిర్మాత రోహిణ్ రెడ్డి, డైరెక్టర్ సునీల్ రెడ్డి, సాయిధరమ్తో బాగా పరిచయం ఉంది. అల్రెడి హ్యాట్రిక్ హిట్ కొట్టిన సాయిధరమ్ ఈ చిత్రంతో సెకండ్ హ్యాట్రిక్ ప్రారంభిస్తాడు`` అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్స్ మన్నార్ చోప్రా, లారిస్సా బోనేసి, అలీ, రఘుబాబు, భాస్కరభట్ల, హర్షవర్ధన్, ముమైత్ ఖాన్ పాల్గొన్నారు.