Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ ఈగల్స్ టీమ్‌‌కు మెంటర్‌గా దర్శకధీరుడు

తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రీడకు సెలెబ్రిటీల ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. కబడ్డీని ప్రోత్సహించేందుకు వారు ముందుకొస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:31 IST)
తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీకి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రీడకు సెలెబ్రిటీల ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. కబడ్డీని ప్రోత్సహించేందుకు వారు ముందుకొస్తున్నారు. తాజాగా దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీలో నల్గొండ ఈగల్స్ టీమ్‌ను ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ జట్టుకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని రాజమౌళినే స్వయంగా సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ మొదలుకానుంది. ఈ టోర్నీలో రాజమౌళి కుమారుడు కార్తీకేయ నల్గొండ ఈగల్స్ టీమ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ జట్టుకు మెంటర్‌గా పనిచేయనున్నానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
ఇప్పటికే రాజమౌళికి క్రీడలంటే ఇష్టం. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే రాజమౌళి.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టుకు జక్కన్న మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే బాటలో రాజమౌళి తనయుడు కబడ్డీ టీమ్‌ను ప్రజెంట్ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments