Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్...

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (19:15 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‏గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ టీం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను కేవలం ఐదు భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు భావిస్తున్నాడు సుకుమార్. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‏డేట్ బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ జరుగుతుండగా.. అనంతరం పారిన్‏ వెళ్ళనున్నారట చిత్రయూనిట్. ఫారిన్ ఎందుకు వెళ్ళనున్నారంటే.. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారట. 
 
ఇక అక్కడి ట్విస్టుతోనే ఇక్కడి అడవుల్లో అసలు కథ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పాత్రలో మరో కోణం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అల వైకుంఠపురం తర్వాత ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో భారీ హిట్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments