Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేటింగ్స్ కోసం మీడియా నా జీవితాన్ని నాశనం చేసింది: పూరీ జగన్నాథ్ (Video)

రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందనీ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

Webdunia
గురువారం, 20 జులై 2017 (08:44 IST)
రేటింగ్స్ కోసం మీడియా తన జీవితాన్ని నాశనం చేసిందనీ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వాపోయారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో పూరీ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్ బృందం ఎదుట పూరీ హాజరయ్యారు. మొత్తం 11 గంటల పాటుసాగిన విచారణ అనంతరం పూరీని సిట్ బృందం అధికారులు వదిలిపెట్టారు. 
 
అనంతరం పూరీ జగన్నాథ్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో పూరీ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సిట్ విచారణకు వెళ్లానని, వారికి పూర్తిగా సహకరించానని చెప్పుకొచ్చారు. సమాజంలో తానెంతో బాధ్యత కలిగిన వ్యక్తినని, పోలీసులు, మీడియా అంటే తనకెంతో ఇష్టమని పూరీ వెల్లడించారు. పోలీసులపై తాను ఎన్నో సినిమాలు తీశానని, జర్నలిస్టుల కోసం ఇజం సినిమా తీశానని చెప్పారు.
 
కానీ, మీడియా తన విషయంలో ప్రవర్తించిన తీరు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. మీడియా రేటింగ్స్ కోసం కట్టు కథలు అల్లి ప్రోగ్రామ్స్ చేసిందని.. వాటి వల్ల తన కుటుంబం బాధతో కుమిలిపోతోందని వాపోయారు. ఈ విషయంలో తాను కూడా ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. నిజంగా చెప్పాలంటే మీడియా జీవితాలను నాశనం చేసిందని పూరీ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా చేసిన పని వల్ల తాను మాత్రమే కాదని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని పూరీ చెప్పుకొచ్చారు. 
 
పైగా, తప్పుడు పనులను తాను ప్రోత్సహించనని పూరీ జగన్నాథ్ అన్నారు. కెల్విన్‌ గ్యాంగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నాపై ఉన్న ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. సిట్‌ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని పూరీ జగన్నాథ్ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments