Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునీత్‌ను పరిచయం చేసింది మన పూరీ జగన్నాథే...

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (16:31 IST)
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ వెండితెరకు పరిచయం చేసింది టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కావడం గమనార్హం. పునీత్ రాజ్‌కుమార్ చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన కేవలం 46 ఏళ్ల వయసులో మృతి చెందడం నమ్మలేకపోతున్నారు. 
 
ఇదిలావుంటే, ఇంతటి స్టార్ డమ్ సంపాదించిన పునీత్ రాజ్ కుమార్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మన తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడం గమనార్హం. 
 
అప్పటికే బాలనటుడిగా దాదాపు 20 చిత్రాలకు పైగా నటించిన పునీత్ ఎంట్రీ కోసం.. లెజండ్రీ నటుడు, ఆయన తండ్రి రాజ్ కుమార్ సరైన కథల కోసం వెతుకుతున్నాడు. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ చెప్పిన అప్పు కథ ఆ కుటుంబానికి బాగా నచ్చింది. వెంటనే ఆయనపై నమ్మకంతో కొడుకు ఎంట్రీని ఆయన చేతుల్లో పెట్టేశాడు. 
 
ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పు సినిమాతో పూరీ సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. అదే సినిమాను తెలుగులో తర్వాత 'ఇడియట్' పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా. అప్పు తర్వాత అదే పేరుతో అభిమానులు పునీత్‌ను పిలుచుకుంటున్నారు.
 
ఇప్పటివరకు 29 సినిమాలలో నటించిన ఈయన.. దాదాపు 25 విజయాలు అందుకొన్నాడు. 90 శాతానికి పైగా సక్సెస్ రేటు.. 100 కోట్ల మార్కెట్ ఉన్న ఏకైక సౌత్ హీరో పునీత్ రాజ్ కుమార్. 
 
కర్ణాటకలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో ఆయన. అలాంటి సూపర్ స్టార్ హఠాత్తుగా మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఆయన లేని లోటు ఎలా భర్తీ చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు అభిమానులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

Mother: బాయ్‌ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే హత్య చేసిన కుమార్తె-చాకలి ఐలమ్మ ముని మనవరాలు..?

హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు- 2 రోజుల్లోనే 10 కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments