దర్శకుడిగా మారిన థర్టీ ఇయర్ ఇండస్ట్రీ.. ఆయన కుమార్తె హీరోయిన్‌!

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (17:54 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్వీరాజ్. ఇపుడు ఆయన దర్శకుడుగా అవతారమెత్తారు. గతంలో రాజకీయాల్లో కొంత కాలం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలోని వైకాపాలో ఆయన చేరి, ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని ఆ పదవికి రాజీనామా చేశారు.
 
ఆ తర్వాత ఆయన వైకాపాకు రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా ఆయన దర్శకుడిగా అవతారమెత్తి, తన ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నారు. ఈయన దర్శకత్వంలో కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఆయన కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా నటించడం గమనార్హం. క్రాంతి కృష్ణ హీరోగా ఎంపిక చేశారు.
 
విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ పీఆర్ క్రియేషన్స్ బ్యానరుపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. తాజా చిత్రం గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments