Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పొలం విషయంలో హీరో రవితేజను మోసం చేశా : నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్‌ స్థాయి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్‌, జూ.ఎన్టీయార్‌, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో పలు చిత్రా

Webdunia
గురువారం, 26 జనవరి 2017 (15:47 IST)
కమెడియన్‌ స్థాయి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన వారిలో బండ్ల గణేష్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్‌, జూ.ఎన్టీయార్‌, మాస్ మహారాజా రవితేజ, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి హీరోలతో పలు చిత్రాలు నిర్మించాడు. 
 
ఆ తర్వాత జూనియ్ ఎన్టీఆర్‌తో ‘టెంపర్‌’ సినిమా తీశాడు. ఈ చిత్రం తర్వాత ఆయన ఒక్కసారి అదృశ్యమైపోయాడు. తాజాగా పవన్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేసి మళ్లీ వార్తల్లోకెక్కాడు బండ్ల గణేష్‌. తాజాగా ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. గతంలో ఓసారి హీరో రవితేజను మోసం చేశానని అంగీకరించాడు. రవితేజ ఎంతో ఇష్టపడి తన దగ్గర పొలం కొనుక్కున్నాడని, అయితే ఆ పొలం విషయంలో ఆయనను మోసం చేశానని తెలిపాడు. 
 
అలాగే జూనియర్‌ ఎన్టీయార్‌తో చేసిన ‘బాద్‌షా’ సినిమా వల్ల తాను ఎంతో నష్టపోయానని, అప్పట్నుంచే ఎన్టీయార్‌తో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పాడు. ఇక, తన దేవుడు పవన్‌ కళ్యాణ్‌కు ఎవరూ సహాయం చేయనవసరం లేదని, తన సమస్యను ఆయనే పరిష్కరించుగోలడని అన్నాడు. అలాగే ఓ దర్శకుడు రాత్రంతా మందు కొడుతూ, డ్రగ్స్‌ తీసుకుంటూ గడుపుతాడని, ఆయనతో పనిచేయడం తన దురదృష్టమన్నాడు. ఆ దర్శకుడి పేరు చెప్పడానికి మాత్రం బండ్ల గణేష్ నిరాకరించాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments