Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (11:21 IST)
హీరోయిన్ సాయిపల్లవితో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. తన సమర్పణలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం తండేల్. ఈ నెల 7వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్ల రూపాయల మేరకు వసూళ్లను రాబట్టింది. 
 
ఈ నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం వేదికగా ఈ చిత్రం థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో హీరోయిన్ సాయిపల్లవితో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ఈవెంట్‌కు హైలెట్‌గా నిలిచింది. అలాగే, నాగ చైతన్య కూడా డ్యాన్స్ చేసి ఆలరించారు. ఈ సందర్భంగా ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు యూనిట్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 
 
కాగా, జాలర్ల జీవన విధానాన్ని కళ్లకి కట్టిన సినిమా తండేల్. రాజుగా నాగ చైతన్య, బుజ్జి తల్లిగా సాయిపల్లవి కలిసి నటించారు. పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఎమోషన్ అంతా రాజు, సత్యల మధ్యే నడుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు కార్డు పలికేవరకు బుజ్జితల్లి, రాజుల ప్రేమతో నింపేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బాగా దోహదపడింది. పాటలతో పాటు బీజేపీను అదరగొట్టేశారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. గొప్ప స్నేహితుడు... (video)

అపుడు రిషభ్ పంత్‌ ప్రాణాలు రక్షించి... ఇపుడు చావుతో పోరాటం చేస్తున్నాడు..

Valentines Day Special: దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్ వాలంటైన్స్ డే విషెస్ (video)

గడ్డివాము వద్ద అనుమానాస్పదంగా సీఐడీ డీఎస్పీ మృతదేహం!!

మణిపూర్ : ఇద్దరు జవాన్లను కాల్చి తనను తాను కాల్చుకున్న జవాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments