Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవితో నృత్యం చేసిన నిర్మాత అల్లు అరవింద్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (11:21 IST)
హీరోయిన్ సాయిపల్లవితో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. తన సమర్పణలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం తండేల్. ఈ నెల 7వ తేదీన విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్ల రూపాయల మేరకు వసూళ్లను రాబట్టింది. 
 
ఈ నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం వేదికగా ఈ చిత్రం థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో హీరోయిన్ సాయిపల్లవితో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం ఈవెంట్‌కు హైలెట్‌గా నిలిచింది. అలాగే, నాగ చైతన్య కూడా డ్యాన్స్ చేసి ఆలరించారు. ఈ సందర్భంగా ఘన విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు యూనిట్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. 
 
కాగా, జాలర్ల జీవన విధానాన్ని కళ్లకి కట్టిన సినిమా తండేల్. రాజుగా నాగ చైతన్య, బుజ్జి తల్లిగా సాయిపల్లవి కలిసి నటించారు. పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఎమోషన్ అంతా రాజు, సత్యల మధ్యే నడుస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు కార్డు పలికేవరకు బుజ్జితల్లి, రాజుల ప్రేమతో నింపేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బాగా దోహదపడింది. పాటలతో పాటు బీజేపీను అదరగొట్టేశారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments